నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయం తర్వాత ఇద్దరు మాస్ డైరెక్టర్ లను లైన్లో పెట్టాడు.క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తుంటే.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.107వ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేసాడు. ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ ద్వారా గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే 108వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి మొన్న సాలిడ్ అప్డేట్ ఒకటి ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇంత సడన్ గా ఇలాంటి అప్డేట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటా అని అంత ఆరా తీయగా రెండు విషయాలు బయట పడ్డాయి.
ఈ రెండు విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అందరు ఆలోచలనకు పదును పెడుతున్నారు.
మరి NBK108 నుండి సడన్ ప్రకటన రావడం వెనుక కారణం ఏంటి అంటే.టాలీవుడ్ లో ప్రెజెంట్ బంద్ లు నడుస్తున్నాయి.ఇలాంటి సమయంలో టాలీవుడ్ ప్రముఖులు పెద్దరికం చేసుకుని అంతా సజావుగానే ఉంది అని ప్రేక్షకులకు నిరూపించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే అనిల్ – బాలయ్య సినిమా నుండి ప్రకటన విడుదల చేసారు అని ఒక రూమర్ వినిపిస్తుంది.ఇక మరొక రూమర్ ఏంటంటే.బాలయ్య తన 107వ సినిమా పూర్తి కాగానే రాజకీయ పరంగా క్యాంపేయింగ్ లోకి వెల్లాసి ఉందట.కానీ బాలయ్యకు ఇచ్చిన కమిట్ మెంట్స్ ఆగిపోవడం ఇష్టంలేదని.
అందుకే 108 సినిమా కూడా పూర్తి చేసాకనే ఎన్నికల కోసం ప్రచారాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని.ఈ కారణంగానే సడన్ ప్రకటన చేసారని టాక్ వినిపిస్తుంది.
చూడాలి ఇందులో ఏది నిజమో.ఏది కాదో.