కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది.ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్ వంటిదని, పార్టీ సత్తా ఎంటో చూపిస్తామన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నయం కాంగ్రెస్ పార్టీనేనని వ్యాఖ్యనించారు.అదేవిధంగా ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.
ఏదీ ఏమైనా మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.