మరో రెండు రోజులలో ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ పదవుల నుండి వెంకయ్య నాయుడు తప్పుకోబోతున్నారు.ఈ క్రమంలో వెంకయ్య నాయుడు అందించిన సేవలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రశంసించారు.
వెంకయ్య నాయుడు సేవలపై రాజ్యసభలో ప్రసంగించిన మోడీ.రాజ్యసభ చైర్మన్ గా.ఉప రాష్ట్రపతిగా ఆయన సేవలు మరువలేవమని పేర్కొన్నారు.ఆయన పదవీకాలం ముగియటం ఎంతో భావోద్వేగంతో కూడిన సందర్భంగా.
మోడీ అభివర్ణించారు.ఈ సభతో మీకు ఎన్నో చారిత్రక క్షణాలు ముడిపడి ఉన్నాయని వెంకయ్య నాయుడుని కొనియాడారు.
వెంకయ్య నాయుడు భాష మరియు చమత్కారం.ఇంకా ఇతర విషయాలపై ఆయనకున్న పట్టు పై మోడీ పొగడ్తల వర్షం కురిపించారు.
ఆయనతో చాలా సంవత్సరాలు కలిసి పని చేసినట్లు చెప్పుకొచ్చారు.ప్రతి సందర్భంలో అంకితభావంతో వ్యవహరిస్తారని కొనియాడారు.
జాతికి వెంకయ్య నాయుడు సేవలు మార్గదర్శకం అని స్పష్టం చేశారు.ఆయన మార్గదర్శకంలో ఈ ఏడాది 75వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం విశేషంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున కార్గే సైతం వెంకయ్య నాయుడు సేవలను ప్రశంసించారు.