జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం కావడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీలుగా మారిపోయారు.
అలా సెలబ్రెటీలుగా ఎంతో బిజీగా ఉన్న వారిలో సుడిగాలి సుధీర్ టీమ్ ఒకటి.సుడిగాలి సుధీర్ టీమ్ లో గెటప్ శీను ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు ఉన్నారు.
అయితే గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి గెటప్ శీను, సుధీర్ వంటి వారు బయటకు వెళ్లారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ గెటప్ శీను బయటకు వెళ్లడంతో వీరిద్దరు బయటకు వెళ్లడానికి గల కారణం తెలియకపోయినా వీరికి సినిమా అవకాశాలు రావడంతో వెళ్లిపోయారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి వీరిద్దరూ ఎప్పటికైనా రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శ్రీను ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చినట్లు అర్థమవుతుంది.

ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా గెటప్ శ్రీను ఈ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఒక్కసారిగా గెటప్ శ్రీను ఎంట్రీ ఇవ్వడంతో అందరూ పెద్ద ఎత్తున కేకలు వేశారు.గెటప్ శ్రీను రావడంతో ఇంద్రజ మాట్లాడుతూ ఫస్ట్ మీ స్కిట్ కు ప్యాకప్ చేసి అందరూ కలిసి స్కిట్ చేయాలని కోరుతుంది.అయితే గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ కలిసి నటి అన్నపూర్ణమ్మతో స్కిట్ చేశారు.
ఈ స్కిట్ ఎంతో ఫన్నీగా కొనసాగింది.జబర్దస్త్ కార్యక్రమం నుంచి గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో ఈయన తిరిగి ఎంట్రీ ఇచ్చారు ఇక సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ ఎప్పుడో అని అభిమానులు ఆశపడుతున్నారు.







