కూచిపూడి నుంచి చినముత్తేవి గ్రామ రహదారి మురికి కాల్వ పై వంతెన కూలిపోవటం గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు.పాఠశాల, కళాశాల వెళ్లే విద్యార్థులు , ఆసుపత్రికి వృద్ధులు, పిల్లలతో పాటు బయటకు వివిధ పనుల పై వెళ్లే ప్రజలు కాల్వలోకి నడచి వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఎస్సీ కాలనీ దగ్గర ఉన్న వంతెన కూలిపోయింది.దింతో కాలనీ వాసులంతా మరింత.
కష్టాలు పడుతున్నారు కాల్వలో దిగకుండా కూచిపూడి వెళ్లాలంటే నిడుమోలు మీదుగా చుట్టు తిరిగి 20కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది అవేదన వ్యక్తం చేస్తున్నారు.మా కష్టాలను పట్టించుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకంటున్నారు







