యంగ్ హీరోల్లో అక్కినేని నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
అలాగే వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు ఈ అక్కినేని వారసుడు.ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు అందరికి థాంక్యూ చెప్పడానికి వస్తున్నాడు.
ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.రిలీజ్ దగ్గర పడుతుండడంతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తుంది.
అయితే ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త అఫిషియల్ గా బయటకు వచ్చింది.

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రన్ టైం కూడా లాక్ చేసుకుంది.ఇక సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.అలాగే రన్ టైం ను 129 నిముషాలుగా మేకర్స్ కట్ చేసారు.
మరి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇది పర్ఫెక్ట్ సినిమా అనే చెప్పాలి.జులై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
మరి ఈ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుని సక్సెస్ గ్రాఫ్ ను అలాగే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.







