సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలకు కొన్నిసార్లు నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు ఎదురైతే మరి కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు బోల్డ్ ఫోటోలను పంచుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.
బడే భయ్యా కి దుల్హనియా అనే షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ నటి బక్రీద్ సందర్భంగా వేసుకున్న డ్రెస్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బక్రీద్ రోజున ఆమె ధరించిన చీర సరిగ్గా లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.
పండుగ రోజున అందాలను ప్రదర్శిస్తూ ఉర్ఫీ జావెద్ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకు తీవ్రస్థాయిలో కోపం తెప్పించాయి.ఆమె చీర గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ ఈ చీర ఖరీదు కేవలం 320 రూపాయలు మాత్రమేనని కామెంట్ చేశారు.
మరి కొందరు నెటిజన్లు ఉర్ఫీ జావెద్ కు పండుగ రోజున ఎలాంటి దుస్తులు ధరించాలనే జ్ఞానం లేదా అని విమర్శిస్తున్నారు.
మరో నెటిజన్ అయితే ఏకంగా మా అమ్మ పనిమనిషికి ఇదే చీర ఇచ్చిందంటూ కామెంట్ చేయడం గమనార్హం.
మంచి బట్టలు వేసుకోకుండా ఇష్టానుసారం దుస్తులు ధరించడం ద్వారా ఉర్ఫీ అభిమానులకు దూరమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పాపులారిటీ కోసం ఉర్ఫీ దిగజారుతున్నారని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అయితే కొంతమంది మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
టీవీ షోల ద్వారా పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్ చేస్తున్న పనులు ఆమెను అభిమానులకు మరింత దూరం చేస్తున్నాయి.ఉర్ఫీ జావెద్ కొన్నిరోజుల క్రితం స్నానం గురించి చేసిన కామెంట్లపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే ఆమెను అభిమానించే అభిమానులు సైతం అదే స్థాయిలో ఉన్నారని చెప్పాలి.
కెరీర్ విషయంలో ఉర్ఫీ జావెద్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.