ఇటీవల ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించడం తెలిసిందే.తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటన ఉద్దేశించి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతమాత్రమే కాదు త్వరలో మళ్లీ రాష్ట్రానికి మోడీ వస్తారని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండేలా ఎదుగుతామని పేర్కొన్నారు.బీజేపీ తమకు పోటీ కాదు అని భావించే పార్టీలకు పోటీ ఇచ్చే రీతిలో రాణిస్తామని జివిఎల్ స్పష్టం చేశారు. దీంతో జివిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తే ఏపీలో కంటే తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉంది.వచ్చే ఏడాదిలోని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు.
ఈ క్రమంలో బీజేపీ చాలా వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కి మంచి పోటీ చేస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంది.