రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాలలో ఏ జిల్లాకి చెందిన ఆ నాయకులు… సమావేశం అవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా నేడు ఏలూరు లో క్రాంతి కళ్యాణ మండపంలో వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని మాట్లాడుతూ చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని తెలిపారు.
అధికారంలో ఉన్న సమయంలో పరిపాలన సరిగ్గా చేయకుండా నేడు ప్రభుత్వం పై ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరణించిన కౌలు రైతు కుటుంబాలకు రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇస్తే తమ ప్రభుత్వం ఏడు లక్షలు ఇవ్వటం జరిగిందని తెలిపారు.చంద్రబాబు అదేవిధంగా పవన్ కలసి పోటీ చేసిన వచ్చే ఎన్నికల్లో జగన్ యే గెలుస్తాడని ఆళ్ళ నాని.
ఏలూరు ప్లీనరీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.