తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కౌంట్డౌన్ గడియారాన్ని బీజేపీ పార్టీ ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ముగింపుకు కౌంట్డౌన్ ప్రారంభమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వానికి ఇంకా 529 రోజులు మిగిలి ఉన్నాయని ప్రకటించారు నేతలు.కేసీఆర్ ప్రభుత్వానికి ఈరోజు నుంచి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు.
దీనికి 529 రోజులు మిగిలి ఉన్నాయని.కేసీఆర్కు బై బై చెప్పే సమయం వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలలో సాలు దొర సెలవు దొర అనే నినాదంతో టిక్కింగ్ కౌంట్డౌన్ క్లాక్తో కూడిన వెబ్సైట్ను కూడా బీజేపీ పార్టీ ప్రారంభించింది.టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తిచూపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.అమరుల కలల తెలంగాణను నిర్మిస్తుందని బీజేపీ అగ్ర నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందని బీజేపీ నేత ఆరోపించారు.కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రాన్ని దోచుకునే అలీబాబా చాలీ చూర్లుగా మారారని మండిపడ్డారు.
జులై 3న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ప్రకటించేందుకే ప్రధాని మోడీ ప్రసంగించాలన్నారు నేతలు.బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు.
యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వర్గాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేత ఆరోపించారు.కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రెండుసార్లు తగ్గించిందని… అన్ని రాష్ట్రాలు ధరలు తగ్గించినా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిద్రలో ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.