యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్ని అలవరుస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ అన్నారు.8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న యోగా క్యాంప్కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ… చాలా మంది విదేశీయులు ఇండియాకు యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారని అన్నారు.భారత దేశం గొప్పతనం, మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని తెలిపారు.
ఈ వత్తిడి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ యోగా చెయాలని మంత్రి విడదల రజనీ తెలిపారు.