సాధారణంగా యువకులు అంటేనే చాలా హుషారుగా ఉంటారు.కొంత మంది బైక్ దొరికితే దాని హ్యాండిల్ వదిలేసి స్టంట్లు వేస్తారు.
అవి చూసిన వారికి గుండెలు అదురుతాయి.ఎక్కడ పొరపాటున పడిపోయి ప్రాణాలు కోల్పోతారో అని భయం వేస్తుంది.
అయినప్పటికీ బైక్ స్టంట్లు వేసే వారు అవేమీ పట్టించుకోరు.కొంత మంది మరింత ప్రమాదకర స్టంట్లు వేస్తారు.
రైలుపై కొందరు ఫొటోలు, వీడియోలు తీసుకోవడమే కాకుండా గంతులు వేస్తారు.వారి కుప్పి గంతులు వల్ల ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా భయపడుతుంటారు.
తాజాగా ఇంటర్నెట్లో ఇటీవల కాలంలో హల్చల్ చేస్తున్న వీడియోలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు.అవి వారికి వినోదంగానే ఉన్న చూసే వారు ఆందోళన చెందుతున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రైలుపై చేసే ప్రమాదకర విన్యాసాల వల్ల యువకులు ప్రాణాలు కోల్పోయిన అనేక కేసులు ఉన్నాయి.
దురదృష్టవశాత్తు, యువకులు అవంటే ఎంతో ఇష్టంతో కొనసాగిస్తుంటారు.సోషల్ మీడియాలో కొన్ని లైక్ల కోసం, షేర్ల కోసం ప్రాణాలు పణంగా పెట్టి స్టంట్లు చేస్తుంటారు.
కొంచెం థ్రిల్ కోసం అయినా, చూసే వారికి భీతిగొల్పుతోంది.ఇటీవల సోషల్ మీడియాలో హల్ చేస్తున్న వీడియో కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు.
అమెరికాలోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఈ వీడియో తీశారు.అందులో 8 మంది యువకులు ఒకరిని మించి మరొకరు స్టంట్లు వేస్తున్నారు.
ఆ రైలు ఓ వంతెన కింది నుంచి వెళ్లే క్రమంలో దాని పై నున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.అది చూసిన నెటిజన్లు వారిని తిట్టి పోస్తున్నారు.
ఏ మాత్రం కాలు జారినా, ప్రాణాలు పోతాయని కామెంట్లు పెడుతున్నారు.థ్రిల్ కోసం, సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలు తీసుకోకండి అంటూ హితవు పలుకుతున్నారు.