సాధారణంగా తెలుగు సినిమాలలో హీరోయిన్లుగా తెలుగువారిని కాకుండా పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెలుగు సినిమాలలోకి తీసుకు వస్తారు.అయితే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తెలుగు భాష రాదని చెప్పాలి.
ప్రస్తుతం అయితే కొందరు హీరోయిన్లు తెలుగు నేర్చుకుంటూ వారి సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.కానీ కొంత మంది హీరోయిన్లకు తెలుగు భాష రాకపోవడంతో డబ్బింగ్ కోసం డబ్బింగ్ ఆర్టిస్టులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది.
ఈ విధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సవితా రెడ్డి ఒకరు.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్, త్రిష, రాశి ఖన్నా వంటి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సవితా రెడ్డి డబ్బింగ్ ఆర్టిస్ట్ పడే కష్టాల గురించి తెలిపారు.
డబ్బింగ్ చెప్పడం చాలా సులువైన పనేమీ కాదని చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.
ఒక సన్నివేశం చిత్రీకరించిన తర్వాత హీరోయిన్ లిప్ మూమెంట్ కు అనుగుణంగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం పక్కరాష్ట్రాల హీరోయిన్స్ రావడం వల్ల వారికి తెలుగు సరిగా రాక తుతుతు అంటూ ఆ సన్నివేశంలో నటిస్తారు.అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ సన్నివేశానికి అనుగుణంగా మనం లిప్ మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక కాస్త కష్టం అనిపిస్తుందని తెలిపారు.
అయితే డబ్బింగ్ చెప్పడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే స్క్రిప్ట్ తమకు ఇస్తారని ఒకసారి రిహార్సల్స్ చేసిన తర్వాత టేక్ తీసుకోవాల్సి ఉంటుందని సవితా తెలిపారు.అందుకే హీరోయిన్లు కాస్త భాష నేర్చుకొని వస్తే తమకు డబ్బింగ్ చెప్పడం చాలా సులువు అవుతుందని సవితా ఈ సందర్భంగా తెలియజేశారు.