ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.గత అనుభవాల నుంచి జనసేన గుణపాఠాలు నేర్చుకునే పనిలో ఉన్నట్లు కనపడుతోంది.అందుకే గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది.2024 ఎన్నికలకు ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది.ఇప్పటివరకూ జనసేనాని పవన్ ఒక్కరే అన్నీతానై వ్యవహరిస్తున్నారు.నాదేండ్ల మనోహర్ చేతనైనంత సాయం చేస్తూ వస్తున్నారు.ఇప్పడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక చేయి వేశారు.అందుకే పార్టీ కార్యక్రమాలు విస్త్రతమవుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానన్న పవన్ ప్రస్తుతం అదే పనిలో పడ్డారు.ఇవాళ అమరావతిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈసమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు అంశాలపై చర్చించనున్నారు.
![Telugu Amith Sha, Ap Poltics, Janasena, Modi, Pawan Kalyan, Ys Jagan-Political Telugu Amith Sha, Ap Poltics, Janasena, Modi, Pawan Kalyan, Ys Jagan-Political](https://telugustop.com/wp-content/uploads/2022/06/ycp-ys-jagan-2024-elections-bjp-modi-amith-sha.jpg)
జనసేన అధినేత ఎప్పటినుంచో రాష్ట్రంలో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలిసి నడవడానికి ఆయన మానసికంగా సంసిద్ధులవడమేకాకుండా పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తామిద్దరికి జతకూడితే మరింత బలం చేకూరుతుందని, అందుకు మోడీని, అమిత్ షాను ఒప్పించగలనన్న ధీమాలో పవన్కల్యాణ్ ఉన్నారు.
ఈ క్రమంలో ఆయన త్వరలో ఢిల్లీ టూర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.గతంలో కంటే భిన్నంగా జనసేన వ్యూహాలు చేస్తుంది.గత అనుభవాల నుంచి గుణపాఠాలు జనసేన నేతలు నేర్చుకుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందస్తుగానే కసరత్తు పెంచారు.
పవన్కు చేదోడుగా మెగా బ్రదర్ నాగబాబుపార్టీ వ్యూహాలను పదును పెట్టే పనిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానన్నారు పవన్.
అయితే జనసేన అధ్యక్షుడు ఢిల్లీ వేళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.