ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోర్ అలియాస్ సంగీత ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయి ఆపై మూడు రోజుల తర్వాత రోహ్ తక్ సమీపంలో శవమై కనిపించిన విషయం తెలిసిందే.అయితే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె స్నేహితులు అయిన రవి, అనిల్ ను తాజాగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.అయితే ఈ విచారణలో భాగంగా ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్లాన్ ప్రకారమే సంగీతను దారుణంగా హత్య చేశారని తెలిపారు.
అంతేకాకుండా చంపడానికి ముందు ఆమెకు 10 నిద్ర మాత్రలు కూడా ఇచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించాడు అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సంగీత హత్య సంఘటనలో సూత్రధారి రవి అని విచారణలో వెల్లడైందని,అతడి సూచన మేరకు అనిల్ ఢిల్లీకి వచ్చి మృతురాలిని కారులో ఎక్కించుకుని వచ్చాడని, మెహం వైపు వెళుతుండగా దారిలో మధ్యలో అనిల్ చెరుకు రసంలో ఆమెకు 10 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాడని పోలీసులు తెలిపారు.హర్యానాలోని కలనౌర్ దగ్గరికి రాగానే రవి వారిని కలిశాడట.
ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్కడే సమీపంలోని గులాటి దాభాలో భోజనం చేసి,మెహం సమీపానికి రాగానే సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దీంతో ఆమె స్నేహితుడు రవి ఆమె పీక నులిమి హత్య చేశాడట.ఆ తర్వాత మెహం ప్రాంతంలో పాతి పెట్టినట్టు నిందితులు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు.కాగా రిలేషన్లో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు