టాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రకుల్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
రకుల్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు, టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అలాగే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మమేకమైపోతుంది.
ఇక అక్కడి అందాలనూ ఆస్వాదించడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కు సాహసయాత్రలు అంటే ఇంకా చాలా ఇష్టం.
అంతే కాకుండా ఆమెకు ఒంటరిగా బేర్ గ్రిల్స్ లాంటి సాహసాలు చేయడం అంటే ఇంకా చాలా ఇష్టమట.
కానీ తాను నటి కావడంతో ఆ స్కోప్ లేదు.
అయితే ఇదే విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అయితే తన కోరికలు సినిమాల పాత్రల రూపంలో దక్కితే మరింత సంతోష పడుతుందట.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండపొలం సినిమా సమయంలో ఆమె పచ్చనైన ప్రకృతి అందాలను ఎంతగానో ఆస్వాదించాను అని ఆ సినిమా ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అడ్వెంచర్ ట్రిప్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అందులో రకుల్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ పై బ్లూ కలర్ లైప్ జాకెట్ ను ధరించింది.అలాగే కూలింగ్ గ్లాసెస్ తలకి టోపీ పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అయితే ఆ లొకేషన్ ఎక్కడ అన్నది తెలియదు కానీ ఆ అడ్వెంచర్ ట్రిప్ అని మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ బాగానే ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక రకుల్ ప్రీత్ సింగ్ దిగిన ఆ ఫోటోలో ఆమె వెనుక భాగంలో పెద్ద పెద్ద కొండ రాళ్ళు కనిపిస్తున్నాయి.
ఆ ఫోటో ని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అభిమానులు కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.