బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.ముఖ్యంగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరోల గురించి, స్టార్ కిడ్స్ గురించి ఛాన్స్ దొరికినప్పుడల్లా వారిపై విమర్శలు చేస్తూ ఉంటారు.
ఇలా కంగనా నిత్యం పలువురు హీరోల పై తన విశ్వరూపాన్ని చూపిస్తుంటారు.ఇక ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించి సౌత్ హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ… బాలీవుడ్ హీరోలను ఏకిపారేస్తున్నారు.
ఇక కంగనా నటించిన ధాకడ్ సినిమా ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కంగనా తన సినిమా కన్నా ఇతర హీరోల గురించి ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పై విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలకు ఈమె మద్దతు పలుకుతూ మహేష్ బాబు అన్న మాటలో నిజం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా హీరో అల్లు అర్జున్ గురించి ఈమె ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ స్టార్ కిడ్స్ ను బాయిల్డ్ ఎగ్స్ అంటూ కామెంట్ చేశారు.
అల్లు అర్జున్ స్టార్ హీరో అయినప్పటికీ పుష్ప సినిమాలో ఒక కూలి పాత్రలో నటించారు.అదే అలాంటి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరు నటించరని ఈమె తెలిపారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు తమని తాము చూసుకున్నారు కనుక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ మరోసారి అల్లు అర్జున్ కొత్త సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పై విమర్శలు చేశారు.
ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.