బోడేపూడి కళానిలయానికి 10వేలు విరాళం ఇచ్చిన మందడపు రామారావు

ఖమ్మం జిల్లా వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి భవనంకు పార్టీ సీనియర్ నాయకులు, సుందరయ్య నగర్ శాఖ 1 కార్యదర్శి మందడపు రామారావు 10 వేల రూపాయిలను విరాళంగా అందజేశారు.కార్ల్ మార్క్స్ జయంతి రోజున జన్మించిన తన మనవడు చావా రుద్రాన్ష్ 11వ పుట్టినరోజు సందర్భంగా బొడెపుడి భవనంలో కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.

 Mandapu Rama Rao Donated Rs 10 Lakh To Bodepudi Art Gallery-TeluguStop.com

అనంతరం పదివేల రూపాయలను విరాళంగా సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ కు అందించారు.ఈ సందర్భంగా మందడపు రామారావు మాట్లాడుతూ మార్క్స్ పుట్టిన రోజున తన మనవడు చావా రుద్రన్ష్ పుట్టడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అనంతరం వైరా పట్టణంలోని బాలవెలుగు పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి, అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సుతకాని జైపాల్, సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, దార్నా రాజశేఖర్, దార్నా వెంకటేశ్వరరావు, మందడపు వాసు, పణితి సైదులు, సీతారాములు, మందడపు చంద్రకళ, మందడపు విశ్వశాంతి, చావా జయదీర్, గుడిమెట్ల మెహనరావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube