ఈ మధ్య కాలంలో మోహన్ బాబు, నాగబాబు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే సంగతి తెలిసిందే.ఒకరి కుటుంబ సభ్యులు మరొకరి కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా కొంతకాలం క్రితం థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో ప్రదర్శితమైంది.ఈ సినిమా కలెక్షన్లు కూడా దారుణంగా వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ లేదా కేజీఎఫ్2 సినిమాలలో ఏది బెస్ట్ అని అడగగా ఈ రెండు సినిమాలు కాదు ఒక లెజెండరీ గ్రాఫిక్స్ సినిమా అని చెప్పుకొచ్చారు.సన్నాఫ్ ఇండియా పేరు చెప్పకపోయినా నాగబాబు పరోక్షంగా ఆ సినిమా గురించే ప్రస్తావించారు.
నాగబాబు కామెంట్ల గురించి మోహన్ బాబు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల నాగబాబు, మోహన్ బాబు కుటుంబాల మధ్య సమస్య మొదలైంది.ఆ గొడవ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.మెగా ఫ్యామిలీ లేదా మంచు ఫ్యామిలీ ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తే మంచిది.ఈ సమస్య వల్ల అభిమానుల మధ్య ఇండస్ట్రీ చులకన అయ్యే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు నాగబాబు ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు.
ఈ షోలో ఇచ్చే ఫ్రైజ్ మనీతో పాటు నాగబాబు సొంతంగా కొంత మొత్తం ప్రైజ్ మనీని ఇస్తుండటం గమనార్హం.నాగబాబుకు ఈ షో ద్వారా భారీగానే రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది.