టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని అఖిలాండం వద్ద టిడిపి స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబు 72 వ జన్మదినం సందర్బంగా 720 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు.
, 7 కేజీల రెండు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు.తమ అభిమాన నేత దీర్ఘాయిస్సు, టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడు గోవింద అంటూ మొక్కులు సమర్పించుకున్నారు.
అనంతరం టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో కొబ్బరి కాయలు కొట్టమన్నారు.రాబోయే రోజుల్లో ఆంధ్రరాష్ట్రాని పరిపాలించాలని, ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఆయన మంచి పరిపాలన సాగించాలని కోరుకున్నామన్నారు.72 వ జన్మదినం సందర్బంగా 720 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు,7 కేజీల రెండు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించామన్నారు.







