మారుతీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ప్రెసెంట్ మారుతీ గోపీచంద్ హీరోగా యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ‘పక్కా కమర్షియల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఈ సినిమా అయిన వెంటనే మారుతీ ఏకంగా డార్లింగ్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసాడు.
ఎవ్వరు ఊహించని కాంబో ప్రకటించడంతో అందరు ముందు షాక్ అయ్యారు.ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.
ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
ఇవి పూర్తి అయ్యే వరకు మరొక సినిమా ఉండదు అని అంతా అనుకున్నారు.కానీ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసి అందరు ఆశ్చర్య పోయారు.
మారుతి, ప్రభాస్ కాంబోలో సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది.ఈ సినిమా టాక్ బయటకు వచ్చినప్పటి నుండే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు.ఈ టైటిల్ విషయంలో కాస్త సందేహాలు నడుస్తున్నప్పటికీ ఈ సినిమా మాత్రం పక్క ఉంటుంది అని తెలుస్తుంది.
మారుతి సన్నిహిత వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పక్కా కమర్షియల్ పూర్తి అయినా తర్వాత వెంటనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.
ఈ సినిమా రిలీజ్ అవగానే ప్రభాస్ సినిమా స్టార్ట్ చేసేందుకు మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడట.అలాగే ఈ సినిమా స్టార్ట్ అయినా తక్కువ సమయంలోనే పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచనున్నారట.ఈ సినిమాను ఇదే ఏడాదిలో డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగు తున్నాయని తెలుస్తుంది.
ఈ చిన్న సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.