బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉండి నేడు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లి వేడుకకు ఆర్ కె స్టూడియోస్ ఎంతో అందంగా ముస్తాబయింది.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరి వివాహ మహోత్సవానికి కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఇలా వీరిద్దరి పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుండగా సూరత్ కి చెందిన అభిమానులు ఈ జంటకు వినూత్నమైన కానుకను పంపించారు.
సూరత్ కి చెందిన ఇద్దరు బంగారు వ్యాపారవేత్తలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత పూసిన 125 గులాబీలు ఒదిగి ఉన్న ఒక బోకేను ఈ జంటకు బహుమానంగా అందజేశారు.
ఇలా తమ అభిమాన హీరో హీరోయిన్ ల పెళ్లి వేడుకకు ఇలాంటి గిఫ్ట్ పంపించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆ బంగారపు బోకేకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పటికే ఈ జంటకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు స్టార్ సెలబ్రిటీలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.బుధవారం ఫ్రీ వెడ్డింగ్, మెహందీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ ప్రేమ జంటకు బిగ్ బీ, కరణ్ జోహార్ వంటి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్ర టీమ్ వీరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియ చేశారు.







