సినీ ప్రేమజంట లకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ మీడియాకు ఫుల్ మీల్స్ లాంటివే.సినీ ప్రేమ జంటలు ఎవ్వరైనా కెమెరా కంట పడ్డారు అంటే చాలు ఇక అది కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోతోంది.
అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా కాకుండా ఇక బాహాటంగానే నడిపిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఇలా బాయ్ ఫ్రెండ్ మత్తులో మునిగి తేలుతున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఇక ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ శంతనుని పొగడ్తలతో ముంచెత్తింది.నువ్వే నా సర్వస్వం నువ్వే నా బంగారం అంటూ మీడియాలో తెగ పోస్టులు పెడుతుంది.
ఇంతకాలానికి సరైనవాడు దొరికాడు అంటూ చెబుతోంది శృతిహాసన్.అయితే గతంలో మిచెల్ కార్సిల్ అనే వ్యక్తి తో రిలేషన్ షిప్ లో కొనసాగి బ్రేకప్ అయ్యింది.
మరో ముద్దుగుమ్మ తాప్సీ సైతం తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టపట్టాలేసుకుని కెమెరాల ముందు తిరుగుతుంది.లారెన్స్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోతో ప్రేమలో ఉంది ఈ అమ్మడు.
ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెబుతోంది.
ఇక బాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వస్తే.దిశా పఠానీ టైగర్ ష్రాఫ్ పేరు ఎప్పటినుంచో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.5 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.బాలీవుడు లో బిజీ అయిన సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ సైతం తన బాయ్ ఫ్రెండ్ ని అందరికీ పరిచయం చేసింది.
బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు జక్కీ భగ్నన్ని అంటూ తెలిపింది.చాలా కాలంగానే వీరి ప్రేమ వ్యవహారం కూడా కొనసాగుతూ వస్తోంది.
భరత్ అనే నేను సినిమా తో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లో పీకల్లోతు ప్రేమలో ఉంది.ప్రతి వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తుంది.సిద్ధార్థ నాకు తగిన వాడు అంటూ చెబుతోంది.ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అలియాభట్ సైతం తనకు సరైనవాడు దొరికేంత వరకు వెయిట్ చేసి రణబీర్ కపూర్ తో ఐదేళ్లపాటు ప్రేమలో ఉంది.
ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.సూపర్ స్టార్ నయనతార ఎంతో మంది తో ప్రేమలో ఉండి బ్రేకప్ అయిన తరువాత చివరికి విగ్నేష్ శివన్ తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది.
చివరికి వీళ్లు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు
.