డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ టోర్నలోకి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది.ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తైంది.
దీంతో రవీంద్ర జడేజా జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పలేదు.దీంతో జడేజా వరుస ఓటముల బాధ నుండి బయట పడేందుకు.
అన్నీ మరిచి సరదాగా బాస్కెట్ బాల్ ఆడాడు.
అయితే ప్రపంచంలో ఉత్తమ ఆల్ రౌండర్ గా మాత్రమే మనకు తెల్సిన జడ్డూ.
తనలోని మరో కళను ప్రపంచానికి పరిచయం చేసాడు.కనీసం నెట్స్ వైపు చూడకుండానే బాస్కెట్ బాల్ ను వేసి శబాష్ అనిపించుకున్నాడు.
యూ జ డ్డు.ఇలా ఒక్కరి సారి కాకుండా మూడు నాలుగు సార్లు బాస్కెట్ బాల ను దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
కొన్ని గంటల్లోనే అది వైరల్ గా మారింది.జిడ్డూ కి సూపర్ టాలెంట్ ఉందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.
మరికొందరు జడేజా ఏదైనా చేయగలడు.నిమిషాల్లో మ్యాచ్ స్వభావాన్ని మార్చే సత్తా సైతం జడేజా కి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.ఏప్రిల్ 9న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ తో బోణీ కొట్టాలన్న కసితో ఉంది.
మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా ఈ మ్యాచ్ తో బోణీ కొట్టి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలనే ప్లాన్ లో ఉంది.హైదారాబాద్ తో జరిగే మ్యాచ్ లో దీపక్ చాహర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది.







