ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ పాత్రకు స్క్రీన్ స్పేస్ తగ్గిందని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.ఒక దశలో ఆర్ఆర్ఆర్ రోల్ విషయంలో తారక్ సైతం సంతృప్తితో లేరని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఆర్ఆర్ఆర్ మూవీలో రోల్ తగ్గించడంతో తారక్ తన భవిష్యత్తు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించడం లేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే తాజాగా తొలిసారి ఈ వార్తల గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ పాత్రను, తన పాత్రను రాజమౌళి బ్యాలెన్స్ చేశారని తారక్ కామెంట్లు చేశారు.సినిమాలో చరణ్, తాను ఒకరి పాత్రలను మరొకరు మెచ్చుకున్నామని తారక్ కామెంట్లు చేశారు.
కొందరు అభిమానులు చేస్తున్న కామెంట్లలో ఏ మాత్రం వాస్తవం లేదని తారక్ క్లారిటీ ఇచ్చేశారు.తారక్ స్పందన తర్వాతైనా వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయెమో చూడాల్సి ఉంది.
తన రోల్ విషయంలో సంతోషంగా ఉన్నానని తారక్ క్లారిటీ ఇచ్చేశారు.
మరోవైపు ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

దేశంలోని టాప్5 సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడ ఆగుతాయో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ అభినయం కోసమే చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమాను మళ్లీ చూస్తున్నారు.

ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలతో కూడా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.తారక్ కు జోడీగా అలియా ఈ సినిమాలో నటిస్తున్నారు.







