ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక విషయం హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.మాములుగా చిరంజీవి కి కమర్షియల్ యాడ్స్ లో నటించడం అంటే ఇష్టం ఉండదు.
ఈయన గతంలో ఎప్పుడో ఒకసారి థమ్స్ అప్ యాడ్ లో నటించారు.మళ్ళీ ఇన్నేళ్లకు మెగాస్టార్ మరొక యాడ్ లో కనిపించి అందరిని ఆకట్టు కున్నాడు.
శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీ కి చెందిన యాడ్ లో చిరంజీవి నటించారు.
ఈ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేసాడు.
ఈ యాడ్ అందరిని మెప్పించింది.చిరంజీవి తో పాటు ఖుష్బూ, అనసూయ కూడా ఈ యాడ్ లో కనిపించారు.
ఈ యాడ్ కాన్సెప్ట్ అందరిని ఆకట్టు కుంది.దీంతో సుకుమార్ మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న ఇప్పుడు మాత్రం ఈ యాడ్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ యాడ్ కోసం చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ వింటే కళ్ళుతిరగడం ఖాయం.
ఏకంగా చిరు సినిమా రెమ్యునరేషన్ లో సగం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈ యాడ్ కోసం చిరు పారితోషికంగా 7 కోట్ల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇప్పటి వరకు యాడ్ లలో నటించిన ఏ హీరో కూడా ఇంత పెద్ద మొత్తం పుచుకున్న దాఖలాలు లేవు.

కానీ మెగాస్టార్ మాత్రం ఇంత మొత్తం అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.అటు ఖుష్బూ, అనసూయ కూడా భారీగా అందుకున్నారట.ఈ వార్తనే ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో చర్చించు కుంటున్నారు.ఇక చిరు సినిమాలు పరంగా కూడా దూకుడుగా వ్యవహరిస్తూ కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నాడు.ఈయన నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.అలాగే భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు షూటింగ్ జరుపు కుంటున్నాయి.







