టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో రాశీ ఖన్నా కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
రాశీ ఖన్నా మొదట మద్రాస్ కేఫ్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.
ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ తరువాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.ఇది ఇలా ఉంటే దాదాపుగా తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్లీ రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
రాశీ ఖన్నా నటించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ విజయం సాధించిన సందర్భంగా తాజాగా రాశీ ఖన్నా జాతీయ మీడియాతో ముచ్చటించింది.ఈ నేపథ్యంలోనే కెరిర్ ఆరంభంలో ఆమెను దక్షిణాది పరిశ్రమ వాళ్ళు గ్యాస్ ట్యాంకర్ అంటూ ఆమెను హేళన చేశారు అంటూ వాటిని గుర్తు చేసుకుంది.అంతేకాకుండా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
తనకు మామూలుగా ఉండటం నచ్చదని, కానీ దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన తరువాత దానికి అలవాటు పడిపోయాను అని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తెలుగులో పలు కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ రొటీన్ ఫార్ములా తోనే ఉండి పోయాను అని తెలిపింది.అలా సౌత్ ఇండస్ట్రీ క్రియేట్ చేసిన రోజున ఫార్ములాలన్నింటిని దాటుకుని వచ్చాను అని చెప్పుకొచ్చింది.అలాగే తాను ఇకపై నటించే ప్రతి ఒక్క సినిమాలో కొత్తదనం చూస్తారు అని తెలిపింది రాశీ ఖన్నా.
అలాగే దక్షిణాది హీరోయిన్ లను వారి ప్రతిభ తో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారు అని తెలిపింది రాశిఖన్నా.అభిమానులు హీరోయిన్లకు రకరకాలుగా తయారు చేస్తుంటారు అని, అది తనకు అసలు నచ్చదని, అక్కడ హీరోయిన్ లను మిల్క్ బ్యూటి అని పిలుస్తూ ఉంటారు కానీ అంతకుమించిన టాలెంట్ హీరోయిన్స్ లో ఉంటుంది అని సౌత్ ప్రేక్షకులు అభిమానులు గుర్తించాలి అని ఆమె తెలిపింది.