కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు- రైతులపై మాట్లాడిన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి.కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంత్రిగా కాకుండా ప్రైవేట్ వ్యాపరిలేక్క మాట్లాడుతున్నారు మీరు కొంటె కొనండి లేదంటే…నూకల బియ్యం ప్రజలకు తినిపియండి అన్నాడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దేశాన్ని సాకే రాష్ట్రం తెలంగాణ- మమ్ములను నూకలు తిను అంటావా పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి.
బండి సంజయ్ మైండ్ లేకుండా రోజుకో మాట మాట్లాడుతుండు బండి సంజయ్ కి ఒంట్లో నెత్తురు ఉంటే.మొగోడే అయితే కేంద్రం చేత ధాన్యాన్ని కొనిపియ్యాలి బీజేపీ న్యూకమర్స్ నేతల వల్ల సీనియర్ నేతలు పధ్ధతిలేకుండా మాట్లాడుతున్నారు.
పీయూష్ గోయల్ స్వయంగా కిషన్ రెడ్డి కి ఫోన్ చేసినా- కిషన్ రెడ్డి మీటింగ్ కు రాలేదు.* ధాన్యం కొనాల్సిన భాద్యత కేంద్రానిదే.
* తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టే ఆలోచన కేంద్రం చేస్తోంది.దేశంలోని ధాన్యం అంతా కేంద్రమే కొనుగోలు చేస్తదని రేవంత్ రెడ్డికి తెలీదా?రేవంత్ రెడ్డికి తెలియకపోతే కాంగ్రేస్ పార్టీ నేతలను అడిగి తెలుసుకోవాలి.పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డికి భాద్యత లేదా?ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు అడగటం లేదు * తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనుకోవడం లేదా? * జాతీయ పార్టీలు బీజేపీ- కాంగ్రేస్ రెండు ఒక్కటే అనేది మరోసారి రుజువు అయింది.







