తెలంగాణ రాజకీయం రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ప్రచారానికి అడ్డుకట్ట పడ్డా బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని చాలా బలమైన వ్యూహాలను పన్నుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక బీజేపీ టీఆర్ఎస్ పై సోషల్ మీడియా అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది.అందుకే సోషల్ మీడియా వారియర్స్ ను పెద్ద ఎత్తున తెర వెనుక సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ సోషల్ మీడియా అంతగా యాక్టివ్ గా లేకపోవడం బీజేపీకి లాభించే అంశం కానుంది.మరి బీజేపీకి ధీటుగా టీఆర్ఎస్ సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సహకారం అందిస్తుండటంతో బీజేపీ మరింతగా ఇక ఉన్న అన్ని అస్త్రాలను వాడే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే ఉండనుందనేది ప్రస్తుతం చాలా వరకు విశ్లేషణలు కొనసాగుతున్నా సోషల్ మీడియాకంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ బీజేపీకి ఉండడంతో తెలంగాణలో అధికారం చేపట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసిన పరిస్థితిలలో ఇక నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితిలలో వీటి నియామకం పూర్తయిన వెంటనే మరల వేరే ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేయడం ద్వారా టీఆర్ఎస్ పై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉండేలా చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా బీజేపీ సోషల్ మీడియా అస్త్రం ఏ మేరకు టీఆర్ఎస్ ను నిలువరిస్తుందనేది చూడాల్సి ఉంది.







