పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.
ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
కానీ ఈ ఏడాది అయితే రిలీజ్ చేయాలనీ మేకర్స్ అనుకోవడం లేదట.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న కూడా రిలీజ్ పై చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే ఈ సినిమా రెండు పార్టులుగా మార్చే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని.అందుకే షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదాలు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే రాధేశ్యామ్ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై ప్రభాస్ ను అడిగితే మాట్లాడడానికి నిరాకరించారు.

ఈయన మాట్లాడక పోవడంతో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ను ఎలా రెండు పార్టులుగా తెరకెక్కించాడో ఈ సినిమా కూడా అలాగే తీసుకు వస్తాడా.లేదంటే ఇంకేదన్న కారణం ఉందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ఇక ఇటీవలే రాధేశ్యామ్ రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే.








