దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈ రోజు ది.13-03-2022న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.







