బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు.బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఫిక్స్ చేసుకున్నట్టు టాక్.
అంతేకాదు సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.ఛత్రపతి రీమేక్ తో బీ టౌన్ లో సత్తా చాటాలని చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా సితార బ్యానర్ లో చేస్తున్నాడు.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.ప్రస్తుతం మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నా సితార బ్యానర్ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టింది.
బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ బ్యానర్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ చేస్తుంది.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ కి సంబందించినా మిగతా డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది.రాబోయే సినిమాలతో బెల్లంకొండ బాబు తన రేంజ్ పెంచాలని చూసుకుంటున్నాడు. సితార బ్యానర్ లో సినిమా అంటే పక్కా హిట్ అన్నట్టే లెక్క.







