అప్పుడు అలా, ఇప్పుడు ఇలా పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!!

విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు తెలుపుతూ నిన్న విశాఖపట్నం కూర్మన్నపాలెం లో. జనసేన అధినేత పవన్ భారీ బహిరంగ సభలో మాట్లాడటం తెలిసిందే.

ఈ క్రమంలో పవన్ వైసిపి పార్టీని గట్టిగా టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపించారు.విశాఖ ప్రైవేటీకరణ కావడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం అన్న తరహాలో విమర్శలు చేశారు.

ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పవన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు.పవన్.

కళ్యాణ్ పవర్ లేని స్టార్ అని అందరికీ తెలుసు.పాపం అభిమానులు ఏదో బహిరంగ సభలో అరుస్తుంటే వాళ్ళ పై పవన్ విమర్శలు చేయటం.

Advertisement

దారుణమని గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గతంలో పవన్ అనుకూలంగా మాట్లాడారు అని చెప్పుకొచ్చారు.

మరి అటువంటి పవన్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడని విమర్శించారు.పవన్ కళ్యాణ్ కి నిజంగా నీతి, నిజాయితీ అనేది ఉంటే.రాజకీయాల్లో కొనసాగాలన్నే ఆలోచన ఉంటే.

స్థిరమైన సిద్ధాంతం, స్థిరమైనటువంటి నిర్ణయాలు.తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే రీతిలో నిర్ణయాలు తెలియజేస్తే కచ్చితంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది.

కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణమని అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ వేదిక ఆధారం చేసుకుని వైసిపి పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకొని పవన్ వ్యవహరించారని మండిపడ్డారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో.ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాం, లేఖలు రాశాం, నిరసనలు కూడా చేపట్టామని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Advertisement

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటిలో అనుకూలంగా పవన్ మాట్లాడారు.ఇప్పుడు రోజుకో రీతిలో ప్రజలని మభ్యపెడుతున్నారు.

ఈ విషయంలో పవన్ వైసీపీ ని విమర్శించే అర్హత లేదని కౌంటర్ కామెంట్ చేశారు. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలను మోసం చేసే విధంగా పవన్ వైఖరి ఉందని.

వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.పేర్కొన్నారు.

తాజా వార్తలు