ఈడీ డ్రగ్స్ కేసు.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ ఛార్మి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో భాగంగా పలువురు సినీ తారలను విచారణ చేస్తూ అధికారులు వారి విచారణను వేగవంతం చేశారు.

ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ అధికారులు విచారించగా తాజాగా ఈ విచారణకు నటి చార్మి హాజరయ్యారు.సెప్టెంబర్ రెండవ తేదీన ఛార్మిని పలురకాల ప్రశ్నలతో సుమారు ఎనిమిది గంటలపాటు విచారణ చేపట్టారు.

గతంలో ఈ విషయం గురించి పోలీసులు ఆమెను విచారణ తీసుకురాగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.ఈ క్రమంలోనే ముందస్తు బందోబస్తు చర్యలుగా పోలీసులు ముందుగా లేడీ కానిస్టేబుల్ ని పిలిపించి ఈమె విచారించారు.

ఈ విధంగా గురువారం విచారణకు హాజరైన ఛార్మిని సుమారు ఎనిమిది గంటలపాటు విచారించారు.ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఛార్మి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

Advertisement

ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను ఎక్కువగా మాట్లాడలేనని అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం చెప్పానని, ఈడి అధికారులు ఎప్పుడు పిలిచినా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రస్తుతం ఇంతకన్న తాను ఎక్కువ మాట్లాడలేను అంటూ ఛార్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడమే కాకుండా లావాదేవీల వివరాలను అడగడంతో అధికారులకు డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఈ సందర్భంగా చార్మి తెలియజేశారు.ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి లను విచారించిన ఈడీ అధికారులు తదుపరి నటి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది.

కేవలం డ్రగ్ కేసు మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ విషయం కింద ఈడీ అధికారులు చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 12 మందికి నోటీసులను జారీ చేశారు.ఇకపోతే డ్రగ్స్ కేసు గురించి విచారణలో భాగంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల ఆరవ తేదీన విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు సూచించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు