టాప్ లెస్ ఫొటోలతో మతి పోగొడుతున్న సాహో బ్యూటీ...

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.

కాగా ఈ అమ్మడు 2009వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన "అల్లాఉద్దీన్" అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ లభించింది.

దీంతోపాటు వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంది.అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కేవలం గ్లామరస్ పాత్రలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించి బాగానే మెప్పించింది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వడంతో ఈ అమ్మడు ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది.కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

అయితే ఇందులో టాప్ లెస్ దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫిదా అయిన నెటిజన్లు ఈ ఫోటోలు షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే ఇరవై లక్షల పైచిలుకు లైకులు మరియు కామెంట్లను సమర్పించారు.

అంతేగాక పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ అమ్మడి హాట్ షో కి ఫిదా అయ్యారు.కాగా మరికొందరు నెటిజన్లయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి 35 ఏళ్ల వయసు పైబడినప్పటికీ అందం మాత్రం ఏమాత్రం తగ్గిపో లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 5 కోట్ల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ, కన్నడ, తమిళం, తెలుగు తదితర భాషలలో కలిపి దాదాపుగా ఐదు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు" ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు