ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు..!

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.

 Curfew Eased In 8 Districts And Contiuned Another 5 Districts In Ap , 5 District-TeluguStop.com

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఇచ్చి సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.అయితే రాష్ట్రంలో చాలా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను సడలించారు.

కేసులు తక్కువగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే విధించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సడలింపులు ఇచ్చిన ఆయా జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్నాయని అందుకే సడలింపులు ఇవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లల్లో మాత్రం కర్ఫ్యూని ఇదివరకు ప్రకారంగానే కొనసాగిస్తున్నారు.

ఈ జిల్లాల్లో మార్నింగ్ 6 టూ ఈవెనింగ్ 6 వరకే సడలింపు ఉంటుంది.ఇక ఈ నిర్ణయాలు జూలై 7వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు.జూలై 7 తర్వాత మిగిలిన ఈ ఐదు జిల్లాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube