తెలంగాణ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్.. ??

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ తెలంగాణ కోసం అసువులు బాసిన కుటుంబాలను, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి అంతా తానై ప్రతిపక్షం అనేది లేకుండా ఇంతకాలం పాలన సాగిస్తూ వస్తుందట.

దొర ఒక్క ఈటల ఏం చేస్తాడులే, ఇంతకుముందు రాజయ్యను పదవి నుండి ఇలాగే తప్పిస్తే ఊరుకోలేదా ఏంటి అని భావించినట్లుగా ఉన్నాడు కావచ్చని జనం అనుకుంటున్నారట.

అయితే ఎక్కడ ఈటల తనకు మేకు అవుతాడో అనే భయం లోపల ఉన్నా భయటకు కనపడకుండా తన రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతు ఈటలను అణగత్రొక్కాలని చూసినట్లుగా ప్రచారం.అయితే ఈటల మాత్రం ఏం తక్కువతిన్నాడు నేరుగా తన పదవులకు రాజీనామా చేసి కమళం గూటికి చేరాడు.

కానీ ఈటల అనుచరులకు పొగపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధించేలా చేస్తుందని ఆరోపించారు.తన అనుచరులను వేధిస్తే ప్రభుతాన్ని ఘోరీ కడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇకపోతే తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత హాట్‌గా మారిపోతాయో చూడాలి మరి.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు