ఖిలాడీ రీమేక్ కాదు కాని పోలికలు ఉంటాయ్ అంటున్న దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఒక దొంగగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.

అలాగే డ్యూయల్ రోల్ లో కూడా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇందులో డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

హైవోల్టేజ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతుందని బోగట్టా.ఇదిలా ఉంటే ఈ మూవీ తమిళంలో ఇంకా రిలీజ్ కి నోచుకోని ఓ మూవీకి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది.

అందులోని మెయిన్ ఎలిమెంట్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారని టాక్ నడుస్తుంది.ఇదిలా ఉంటే దీనిపై దర్శకుడు రమేష్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ఖిలాడీ మూవీ అసలు రీమేక్ కాదని, తాను రాసుకున్న స్ట్రైట్ కథతో వస్తుందని స్పష్టం చేశాడు.అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఓ తమిళ్ సినిమాకి పోలికలు ఉంటాయని ఈ నేపధ్యంలో ఈ ప్రచారం తెరపైకి వచ్చిందని తెలిపాడు.

అయితే పోలికలు ఉండటం వలెనే ఆ నిర్మాత దగ్గర పర్మిషన్ తీసుకున్నామని అన్నారు.అంతేగాని ఈ మూవీ రీమేక్ అయితే కాదని చెప్పుకొచ్చాడు.

  ఇక ఈ మూవీ నలభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించిన వెంటనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరో వైపు ఖిలాడీ షూటింగ్ లో ఉండగానే రవితేజ శరత్ మండవ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకొని వెల్లబోతుననాడు.ఈ మూవీ షూటింగ్ కూడా ఆగష్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని బోగట్టా.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు