తెగించేసిన పూజా హెగ్డే... నేను రెడీ, మీదే లేట్ అంటుంది

కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని పూర్తిగా ఆగిపోయాయి.మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలకి లోబడి షూటింగ్ లు మొదలు పెట్టిన చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.దీంతో చాలా మంది నిర్మాతలు షూటింగ్ స్టార్ట్ చేయడానికి భయపడిపోతున్నారు.

అలాగే నటులు కూడా ఇప్పట్లో షూటింగ్ లకి నో ఛాన్స్ అనేస్తున్నారు.హీరోలు కూడా ఇదే మాట అంటున్నారు.

అలాగే కీర్తి సురేష్, నిత్యా మీనన్ లాంటి హీరోయిన్స్ అయితే కరోనాకి వాక్సిన్ వచ్చే వరకు బయటకి వచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు.అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా కొంత మంది హీరోయిన్స్ షూటింగ్ లకి మేము రెడీ అంటూ డేర్ చేస్తున్నారు.

Advertisement

మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిన మీము షూటింగ్ లో పాల్గొంటాం అని చెబుతున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ అయితే మరో అడుగు ముందుకి వేసి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో ఇప్పటికే పాల్గొంది.

ఇదిలా ఉంటే కరోనా సమయంలో ఇన్ని నెలలు ఖాళీగా ఉండి ఫుల్ బిజీ షెడ్యూల్ లీడ్ చేసే పూజ హెగ్డేకి బోర్ కొట్టినట్లు ఉంది.అందుకే నేను షూటింగ్ కి రెడీగా ఉన్నాను అంటూ దర్శక నిర్మాతలకి హింట్ పంపిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా మూవీ ప్రభాస్ రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలు చేస్తుంది.ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.

అలాగే బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మూడు సినిమాలకి కమిట్ అయ్యి ఉంది.దీంతో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పండి, నేను రెడీగా ఉన్న అంటూ దర్శకులకి మెసేజ్ ఇస్తున్నట్లు సమాచారం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

మీరెప్పుడు షూటింగ్ కి రమ్మన్నా నేను రెడీ మీదే ఆలస్యం అంటూ వారికి పూజా సవాల్ విసురుతుందని టాక్.

Advertisement

తాజా వార్తలు