మిల్కీ బ్యూటీ ‘ఆహా’ పారితోషికం ఓహో అన్నట్లుగా ఉంది

అల్లు అరవింద్‌ ఓటీటీ సంస్థ ఆహాలో ఒక టాక్‌ షో ప్రారంభం కాబోతుంది.ఆ టాక్‌ షోకు స్టార్‌ హీరోయిన్‌ తమన్నా హోస్ట్‌గా వ్యవహరించబోతుంది.

అందుకు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ కూడా పూర్తి అయ్యింది.దాదాపుగా 30 రోజుల పాటు ఈ షూటింగ్‌ జరుగనుంది.

మొదటి సీజన్‌లో భాగంగా 30 మంది సెలబ్రెటీలను తమన్నా ఇంటర్వ్యూ చేయబోతుంది.అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యింది.

ఆహా టాక్‌ షో కోసం తమన్నా భారీ పారితోషికం అందుకోబోతుంది.ఒక్కో ఎపిసోడ్‌కు గాను ఏకంగా 10 లక్షలు డిమాండ్‌ చేసిన తమన్నా చివరకు 8 లక్షలకు ఓకే చెప్పిందట.30 ఎపిసోడ్స్‌కు గాను తమన్నా ఏకంగా 2.4 కోట్ల పారితోషికంను ఈ అమ్మడు పొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఒక్కో సినిమాకు కోటికి అటు ఇటుగా పారితోషికం తీసుకునే తమన్నా ఈ టాక్‌ షో కోసం ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతుండటం చర్చనీయాంశంగా ఉంది.

Advertisement

ఆహా ఈ టాక్‌ షో కోసం దాదాపుగా అయిదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందట.మొదటి రెండు ఎపిసోడ్స్‌ రామ్‌ చరణ్‌ ఇంకా అల్లు అర్జున్‌లతో ఉంటుందట.అల్లు అరవింద్‌ తనకున్న పలుకుబడితో స్టార్‌ హీరోలు మరియు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ను ఈ ఇంటర్వ్యూలకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

దాంతో షోను అత్యధికులు చూస్తారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకే ఇంతటి బడ్జెట్‌ అయినా ఆయన ఆందోళన లేకుండా పెట్టేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు