మహానటికి సర్కారు వారు ఇస్తున్న మొత్తం ఎంతో తెలుసా?

మహేష్‌బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కీయిరా అద్వానీ లేదా సాయి మంజ్రేకర్‌ నటించబోతున్నారు అంటూ తెగ వార్తలు వచ్చాయి.

కాని చివరకు ఈ చిత్రంలో తాను నటించబోతున్నట్లుగా మహానటి ఫేం కీర్తి సురేష్‌ ప్రకటించింది.ఈ విషయమై యూనిట్‌ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చారు.

కీర్తి సురేష్‌ ఇప్పటి వరకు ఎన్నో భారీ చిత్రాలు చేయడంతో పాటు మంచి హిట్స్‌ను అందుకుంది.అందుకే మహేష్‌కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ కరోనా కష్ట కాలం కనుక స్టార్స్‌ అంతా కూడా పారితోషికాలు తగ్గించుకోవాలంటూ నిర్మాతలు కోరుతున్న విషయం తెల్సిందే.అందుకే ఈ సినిమాకు కీర్తి సురేష్‌ పారితోషికం ఎంత తీసుకుని ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

ఇటీవలే కీర్తి సురేష్‌ పారితోషికం తగ్గించుకుంది అనే ప్రచారం జరిగింది.ఆ విషయము నిజమే అన్నట్లుగా కీర్తి సురేష్‌ ఈ సినిమా కోసం రూ.1.25 కోట్లు తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సాదారణంగా అయితే కీర్తి సురేష్‌ పారితోషికం 1.75 కోట్లు నుండి 2 కోట్ల వరకు ఉంటుంది.కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరియు మహేష్‌బాబు మూవీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో కీర్తి సురేష్‌ పారితోషికం విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించింది అంటూ టాక్‌ వినిపిస్తుంది.

మొత్తానికి సర్కారు వారి పాట చిత్రం విషయంలో కీర్తి సురేష్‌ చూపించిన సానుభూతి ఆ చిత్ర నిర్మాతలకు కొంతలో కొంత అయినా ఉపశమనం కలిగించే అవకాశం ఉందంటున్నారు.పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ ఇంకా మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్నారు.

మహేష్‌బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు