తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఎప్పటికిప్పుడు ఇండియాపై పడి ఏడిచే స్వభావం పాకిస్థాన్ది.ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
స్వయంగా ఆదేశ ప్రధాని పొదుపు చర్యలు చేపట్టారు.ఎప్పుడు చూసిన కూడా ఎక్కడో ఒక చోట అల్లర్లు, గొడవలు జరుగుతూనే ఉంటాయి.
అలాంటిది మన దేశం గురించి విమర్శలు చేస్తోంది.తాజాగా ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూపిన ‘చంద్రయాన్ 2’ గురించి పాకిస్తాన్ నోరు పారేసుకుంది.
చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా సాగినన్ని రోజులు నోరు మూసుకుని ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు చివరి అడుగులో విఫలం అవ్వగానే వెంటనే స్పందించింది.
పాకిస్తాన్కు చెందిన కేంద్ర మంత్రులు మరియు కొందరు పాకిస్తాన్ నెటిజన్స్ ఇండియా ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఒక పేద దేశం అయిన ఇండియా ప్రయోగం కోసం అంత ఖర్చు చేయడం ఎందుకు అంటూ మంత్రి ఎద్దేవ చేస్తూ పోస్ట్ చేశాడు.ఆ పోస్ట్పై ఇండియన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
మరో పోస్ట్లో అదే పాకిస్తాన్కు చెందిన మంత్రి కుక్క వాగినట్లుగా వాగుతూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈ విషయమై పార్లమెంటులో ప్రశ్నించాలని, డబ్బు వృదాపై నిలదీయాలంటూ సూచించాడు.ఇండియాలోని ప్రతి ఒక్కరు కూడా చంద్రయాన్ను సమర్ధించారు.
అది విఫలం అయినా కూడా ప్రతి ఒక్కరు కేంద్రంకు మరియు ఇస్రోకు మద్దతుగా నిలుస్తున్నారు.అంతే తప్ప మోడీని నిందించాల్సింది ఏమీ లేదంటూ ఇండియన్ నెటిజన్స్ అంటున్నారు.
అమెరికా, రష్యాలతో పాటు ఇంకా ప్రముఖ దేశాలు, చిన్న దేశాలు అన్ని కూడా ఇండియా ప్రయత్నంను అభినందించారు.కాని పాకిస్తాన్ మాత్రమే తన కుక్క బుద్దిని చూపించింది.