ఇద్దరు వారసులతో శంకర్ భారీ మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం

సౌత్ ఇండియా దర్శక దిగ్గజం శంకర్ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన, ఏవో కారణాల వలన ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.దీంతో ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేయాలని అనుకున్న ఇప్పట్లో శంకర్ తో సినిమా చేసేంత ఫ్రీగా ఎవరు లేరు.

 Star Director Shankar Plan To Movie With Star Kinds In Kollywood1-TeluguStop.com

దీంతో శంకర్ ద్రుష్టి ఇప్పుడు ఇద్దరు వారసుల మీద పడినట్లు తెలుస్తుంది.కోలీవుడ్ లో స్టార్ హీరోలైన చియాన్ విక్రమ్ తనయుడు ద్రువ్ హీరోగా ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ తెరకెక్కుతుంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది.ఇదిలా ఉంటే మరో వైపు స్టార్ హీరో విజయ్ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

దానికి సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు.

ఈ నేపధ్యంలో శంకర్ ఇప్పుడు ఈ ఇద్దరు వారసులతో భారీ మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి స్టొరీ లైన్ విజయ్, విక్రమ్ కి చెప్పడం జరిగిందని, వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబదించి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో దర్శక దిగ్గజం ఉన్నాడని సమాచారం.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమాని శంకర్ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube