ప్రపంచంలో వున్న నల్లధనం మొత్తం కూడా స్విజర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న స్విస్ బ్యాంకులో ఉంటుందనేది ఇది అందరికీ తెలిసిన నిజం.ఇక స్విస్ బ్యాంకులో ప్రపంచంలోనే అత్యధిక నల్లధనం ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్ లో ఉందని చెప్పాలి.
స్విస్ బ్యాంక్లో నల్లధనం మొత్తం కూడా తీసుకొస్తే ఇండియా చేసిన అయిపోతుందని చాలామంది ఆర్థికవేత్తలు చెబుతుంటారు.ఇక గత ఎన్నికల్లో స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనాన్ని మొత్తం కూడా బయటకు తీసుకు వస్తామని హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో నరేంద్ర మోడీ సర్కార్ ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా భారతీయ కుబేరుల జాబితాను తీసుకొనేందుకు ఒప్పందం చేసుకుంది.
ఈ నేపథ్యంలో స్విస్ ప్రభుత్వం నల్లధనాన్ని పోగేసుకున్న సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారతదేశానికి అందజేసే ప్రక్రియను ప్రారంభించింది.
కొన్ని వారాల క్రితం 50 మంది భారతీయులకు స్విస్ ప్రభుత్వం నల్లధనం సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వారిని కోరినట్లు సమాచారం.
వీరిలో కొందరి ఆ పిల్లను స్విస్ ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించినట్లు తెలిసింది.ఇప్పటికే సుమారు 100 మంది భారతీయుల నల్ల కుబేరుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఇంతవరకు మోడీ గవర్నమెంట్ ఆ నల్ల కుబేరుల జాబితాను ప్రజల ముందుకు తీసుకు రాలేదు.కానీ వారి వివరాలను త్వరలో బయట పెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.







