ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ ఉద్దండుడు అయిన కావచ్చు.ప్రత్యర్ధి పార్టీలకి చెమటలు పట్టించి, ప్రజలని తమవైపు తిప్పుకునే నేర్పు ఉన్న వ్యక్తి కావచ్చు.
కాని పక్క రాష్ట్రాలలో చంద్రబాబు ప్రచారం, మాటల గారడీ అసలు ఎంత వరకు పని చేస్తుంది అనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేకుండా పని చేయదు అనే మాట చాలా మంది రాజకీయ నాయకులు చెబుతారు.మరి దేశ రాజకీయాలలో చంద్రబాబుకి చక్రం తిప్పీ సత్తా ఉందా ఉందా అంటే ఉంది కాని ప్రజల విశ్వాసం పొందే సామర్ధ్యం లేదనే చెప్పేస్తారు.
ఇప్పుడు కర్ణాటకలో మాండ్యాలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న తెలుగింటి ఆడపడుచు సుమలత కూడా చంద్రబాబుని చాలా తేలిగ్గా తీసుకుంది.బాబు ప్రస్తుతం కర్ణాటకలో జెడీఎస్ తరుపున ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక వెళ్తున్నాడు.
అది కూడా మాండ్యా నియోజకవర్గంలో జెడీఎస్ అభ్యర్ధి కుమారస్వామి కొడుకు నిఖిల్ కోసం ప్రచారం చేయడానికి రెడీ అయ్యాడు.అయితే బాబు ప్రచారం తన నియోజక వర్గంలో ఎలాంటి ప్రభావం చూపించదని సుమలత లైట్ తీసుకుంది.
ఏపీ రాజకీయాలలో అతను ఎ స్థాయి నాయకుడు అయిన కర్ణాటక ప్రజలలో అతనిపై విశ్వాసం అంతంత మాత్రమె అనేసింది.మరి ఈ సుమలత మాటలపై బాబు మాండ్యాలో ఏమైనా కౌంటర్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.







