కాశ్మీర్ లో సిఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్ట్ లు దాడిలో మరినిస్తే వాటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేసి వారి మరణాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్మీ మరణాల వెనుక ప్రధాని మోడీ కుట్ర వుందని అనుచిత వాఖ్యలు చేస్తున్న చంద్రబాబు విచక్షణ మరిచిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంచలన వాఖ్యలు చేసారు.రీసెంట్ గా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ జవాన్ల మృతిపై అనుమానాలు వున్నాయని.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆర్మీ జవాన్లపై దాడితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పాడని, ఆ మాటలు బట్టి చూస్తే మోడీ తన రాజకీయ లబ్ది కోసం ఆర్మీపై దాడి చేయించి ఉంటాడని చంద్రబాబు సంచలన విమర్శలు చేసాడు.ఈ విమర్శలపై సర్వత్రా చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఇదిలా వుంటే తాజాగా రాజమండ్రిలో జరుగుతున్నా బీజేపీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు చేసిన వాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబుకి భారత ప్రధాని కంటే పాకిస్తాన్ అధ్యక్షుడు మీద నమ్మకం ఎక్కువైపోయింది అని విమర్శలు చేసి, చంద్రబాబు వాఖ్యలతో ఆర్మీ జవాన్ల మరణాన్ని అవమానించారని, రాజకీయాల కోసం వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం చంద్రబాబుకి తెలిసినట్లు బీజేపీ పార్టీకి తెలియదని విమర్శలు చేసారు.
తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రతి సారి ఎవరో ఒకరిని మోసం చేస్తూనే వస్తున్నారని, ఇప్పుడు ఏపీ ప్రజలని కూడా మోసం చేస్తూ కేంద్రం ఇచ్చే నిధులని పక్కదారి పట్టించి స్వలాభం కోసం వాడుకున్నారని అమిత్ షా విమర్శలు చేసారు.కేంద్రం ఇచ్చిన హామిలలో 90 శాతం ఏపీలో ఇప్పటికే పూర్తి చేసిందని అమిత్ షా తెలియజేసారు.
ఈ బహిరంగ సభలో అమిత్ షా ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం ద్వారా మరోసారి రాజకీయంగా ఆసక్తి పెంచారు.