సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా … వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నాడు.అంతే కాదు … ఈ మధ్య బిజినెస్ మ్యాన్ గా కూడా మారి తన సత్తా చాటుకుంటున్నాడు.అయితే… అనుకోకుండా ఇప్పుడు మహేష్ కు ఓ చిన్నపాటి ఝలక్ తగిలింది.ఆయనకు జీఎస్టీ షాక్ తగిలింది.

ఆయన అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ ఫ్రీజ్ చేశారు.తొమ్మిదేళ్లుగా పన్నులు కట్టడం లేదని, 73 లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి.యాక్సిక్ బ్యాంక్లో ఉన్న 43 లక్షల రూపాయలు కమీషనర్ స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన డబ్బుల కోసం మహేశ్ బాబుకు నోటీసులు పంపించారు.