ఉద్యోగాలు , ఉన్నత విద్యలని అభ్యసించడం కోసం ఎంతో మంది వ్యాపారాల చేయడం కోసం అమెరికాకి వలసలు వెళ్తుంటారు అలా వెళ్ళే వారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు.ఎన్నో రంగాలలో భారతీయుల హవా అమెరికాలో ఉంటుంది.
అయితే ఇప్పుడు అక్కడ ఉంటున్న భారతీయులకోసం కేంద్ర భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా ప్రాజెక్టు ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగా ఈ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది… హూస్టన్.అట్లాంటా.చికాగో.న్యూయార్క్… శాన్ఫ్రాన్సిస్కో.వాషింగ్టన్…ఈ ప్రక్రియ వేగవంతం చేసింది.అంతేకాదు అమెరికాలోని భారత కాన్సులేట్ లలో పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని అక్కడే పరిశీలించి.భారత్లో ముద్రించి దరఖాస్తుదారులకు ఇచ్చేవారు…దాంతో
10 రోజుల వరకూ ఈ ప్రక్రియకి సమయం పట్టడంతో , పీఎస్పీ వల్ల కాన్సులేట్లోనే పరిశీలించి, అక్కడే ముద్రించి దరఖాస్తుదారులకు మంజూరు చేస్తారు.దాంతో అప్పుడు ఈ ప్రక్రియ మొత్తం రెండు రోజుల్లోనే ముగుస్తుంది.ఎక్కువ రోజులు పాస్పోర్ట్ కోసం వేచి చూడకుండా త్వరిత గతిన ముగుస్తుంది.
తాజా వార్తలు