మంచు మనోజ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు.ప్రజలకు తనవంతు సేవ చేస్తానని.
ఈ జీవితం ఇక ప్రజా సేవకే అంకితమంటూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు.దీంతో పరోక్షంగా ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేసిన మనోజ్.సినిమాలే ప్రపంచం కాదంటూ.
తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని.రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టుకోండి అంటూ .ఓ పెద్ద లెటర్ ను ట్వీట్ చేశాడు.మంచు మనోజ్ షేర్ చేసిన లెటర్ ఇలా ఉంది.