కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలుకాలో ఉన్న యత్తంబాడి గ్రామంలోని మహాదేవమ్మ తోటలో దొడ్డచెన్నిపురకు చెందిన రైతు సోమవారం తన పొలంలో పట్టు పురుగులకు ఆహారం కోసం గడ్డి కోస్తున్నాడు.
ఈ క్రమంలో అతని కాలిపై రక్తపింజర అనే విషపూరిత పాము కాటు వేసింది.దాంతో తన చేతిలో ఉన్న కత్తితో ఆ పామును ఆరు ముక్కలుగా నరికిచంపాడు.
ఆ తరువాత పాము కాటు కారణంగా శరీరంలోకి విషం వెళ్ళకుండ కాలుపై భాగంలో తన టవల్ ను గట్టిగా కట్టి ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో స్పృహ కోల్పోయి కిందపడ్డాడు.వెంటనే స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.